నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు – విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లెలో జాతీయ సైన్స్ డే–2026ను ఫిబ్రవరి 28, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల BS&H విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎన్. రాజా గోపాల్ రెడ్డి, డా. కె. కృష్ణవేణి, డా. జి. రమేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి కన్వీనర్ మరియు BS&H విభాగాధిపతి డా. చ. కల్యాణి నేతృత్వం వహించగా, BS&H విభాగంలోని సమస్త అధ్యాపకులు సహకారం అందించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం బీ.టెక్ విద్యార్థుల కోసం “గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో కృత్రిమ మేధస్సు (AI) అనువర్తనలు” అనే అంశంపై పేపర్ ప్రెజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా దృష్టికోణంతో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీలలో భౌతిక శాస్త్రం విభాగంలో బి. హేమంత్ (AIML) విజేతగా నిలిచారు. రసాయన శాస్త్రం విభాగంలో లిఖిత (AIDS) ప్రథమ బహుమతి సాధించారు. ఆత్మీయ బహుమతిను ఘ్నేయ (AIML) అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతలైన AI వినియోగంపై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొనవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమనందు వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా మొదటి సంవత్సరం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News