నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి...యువశక్తి పౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ ఎద్దేవా. మదనపల్లి ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉందని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచట్ల రెడ్డి గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మీడియాతో మాట్లాడుతూ....పాకెట్లో పైసా లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిని సిబ్బంది పిచ్చోళ్ల ను చూసినట్లు చూస్తున్నారనే విమర్శలు జోరుగా సాగుతున్న సమయంలో ఓ మహిళ ఆసుపత్రి ఎదుటే చనిపోవడం మళ్లీ అసుపత్రి సిబ్బంది తీరుని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎంతో కొంత వైద్యం ఇవ్వచ్చు. లేకుంటే రెండు మందుబిళ్ళలు ఇచ్చి తగ్గిపోతుంది పో అంటే ఆ రోగులు కాస్త ఊరట చెందుతారు. అయితే మదనపల్లె జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి ఇందుకు భిన్నంగా ఉంది. కొందరు సిబ్బంది ఆస్పత్రి తన సొంతం లా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆస్పత్రికి వస్తే తోడు లేకుంటే అడ్మిట్ చేసుకోమని వెనక్కి పంపేస్తున్న సంఘటనలు జిల్లా ఆస్పత్రిలో జరుగురున్నాయి. ఆ కారణం చేతనే తంబళ్లపల్లె నుంచి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్యం పొందడానికి శుక్రవారం వచ్చిన మల్లమ్మ చనిపోయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని కారణంగా ఆరుబయట చలిలో పడుకుని అన్యాయంగా తన ప్రాణాలను పోగొట్టుకుందని అభిప్రాయపడుతున్నారు...
Reporter
Namitha News