Thursday, 30 July 2026 06:46:07 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై యస్.ఐ. సమీక్ష

Date : 08 February 2026 08:48 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 08 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండలో మహాశివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యాలు, తదితర ఏర్పాట్లపై ఎస్సై అనిల్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రి రోజున వచ్చే వేలాదిమంది భక్తులకు రవాణా సౌకర్యం, వాహనాలకు కొండపైన, కొండ కింద పార్కింగ్ ఏర్పాట్లు, కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. మహాశివరాత్రి పర్వదినాన శివమాల భక్తులు, ప్రజలు తంబాలపల్లి, మదనపల్లె నియోజకవర్గాలతో పాటు కర్ణాటక రాష్ట్రం పరిసర జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో పాటు స్థానిక అన్నదాన కమిటీ సభ్యులతో చర్చించారు. మల్లయ్య కొండపై శివరాత్రి రోజున స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటుచేసిన వాలంటీర్ల వివరాలు మంజూరు చేయాల్సిన పాసులు పై విచారణ చేశారు. మహాశివరాత్రి పర్వదినం భక్తులు సమన్వయం పాటించి స్వామివారిని దర్శించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని ఎస్సై ఓ ప్రకటనలో కోరారు. ఆయన వెంట ఏఎస్ఐ నజీర్ భాష, కానిస్టేబుల్ రాఘవ, అన్నదాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :