నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 09 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండకు సోమవారం శివ భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం నాలుగు రోజులే ఉండడంతో మందస్తుగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా గౌరమ్మ గుడి, వీరన్నగెవి, భగీరథి, నిచ్చెనకొండ,ఫారెస్ట్ వ్యూ పాయింట్స్, వెలుగు మల్లమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్టలు భోజన వసతి, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశారు
Reporter
Namitha News