Monday, 20 April 2026 04:18:53 PM
# జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసైనికుడు రాయల్ కుమార్ # జాతీయ స్థాయీ టెక్నికల్ సింపోసియం ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పోలీసులు చేసిన సేవ అభినందనీయం - యస్.ఐ. అనిల్ కుమార్ # అభివృద్ధి పనులతో కోసువారిపల్లి పరుగులు - బేరిపల్లి శ్రీనివాసులు # ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు # అమ్మ చెరువు మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం, తండ్రీ బిడ్డ మృతి # మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే # నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు # మహిళా బిల్లు ఆమోదం పొందలేకపోవడం దురదృష్టకరం # ఉపాధి హామీ పనుల వేగం పెంచండి - డ్వామా పిడి వెంకటరత్నం # ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అనిల్ చంద్ర పునేఠా # రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి –జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్

మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే

28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 లను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు

Date : 18 April 2026 08:57 PM Views : 21

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు 28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందీప్ బడద్ 2025 (UPSC) యూ పిఎస్ సి సివిల్ సర్వీసెస్, 82వ ఆల్ ఇండియా ర్యాంకర్, శ్రీనివాస్ పి.సి, ఫౌండర్ & సి ఈ ఓ, ఇండియా 4IAS అకాడమీ మరియు ప్రశాంత్ శ్రీనివాస్, కో-ఫౌండర్ & డైరెక్టర్, బెంగళూరు,కర్ణాటక పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు ముఖ్య అతిధులు సందీప్ బడద్ జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథి సందీప్ బడద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తన అనుభవాలను పంచుకుంటూ, విజయం ఒక్క రోజులో రాదని, నిరంతర కృషి, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనమని అన్నారు. ఈ నైపుణ్యాలు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కాలేజీ జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రతిరోజూ కొంత సమయం తమ లక్ష్యాల కోసం కేటాయించాలని, ముఖ్యంగా పత్రికలు చదవడం, ప్రస్తుత అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం, సమాజ సమస్యలపై స్పందన కలిగి ఉండడం చాలా అవసరమని సూచించారు. ఆనందంతో పాటు భవిష్యత్తుపై బాధ్యతతో కూడిన ఆలోచన అవసరమని, పట్టభద్రులైన వెంటనే వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతలు వస్తాయని గుర్తు చేశారు. అందువల్ల కాలేజీ జీవితం ఆస్వాదిస్తూ, తమ కలలను సాధించడానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అలాగే లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించి తల్లిదండ్రులకు గర్వకారణమవుతారని తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అని గుర్తుంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ అందించిన నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో యూనివర్సిటీ యొక్క విద్యా విజయాలు, నియామకాలు మరియు పరిశోధన సహకారాలను హైలైట్ చేస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. ఆ తరువాత వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థి అవార్డులు మరియు గుర్తింపులు సాయంత్రం ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :