Thursday, 30 July 2026 05:37:51 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ట్రాక్టర్లో నుంచి పడి వ్యక్తి మృతి

Date : 04 February 2026 07:12 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రాక్టర్లో నుంచి పడి వ్యక్తి మృతి ట్రాక్టర్ లోంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం, బండమీద కొత్తపల్లికి చెందిన శేఖర్ రెడ్డి(45), మమత దంపతులు గత కొన్నేళ్లుగా మదనపల్లె మండలం, బయ్యారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. శేఖర్ రెడ్డి బోరు బండి పనులకు వెళ్తూ జీవనం చేసేవాడు. తోటి స్నేహితులతో కలిసి బోరు ఫిట్ చేసే ట్రాక్టర్ లొఇ ముదివేడుకు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ని ముదివేది క్రాస్ వద్ద ట్రాక్టర్లో నుంచి అదుపుతప్పి జారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. మార్గమధ్యంలో శ్రీనివాసపురం వద్ద శేఖర్ రెడ్డి మృత్యువాత పడ్డాడు. మృతుడికి కుమార్తె రమ్య, కుమారుడు శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :