Thursday, 30 July 2026 01:09:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

Date : 14 March 2026 10:26 PM Views : 314

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 14 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో శనివారం జనసేన మండల నాయకులు గోల్లపల్లి సిద్ధమల్ రెడ్డి, టిడిపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. క్రాస్ రోడ్ లో తంబళ్లపల్లె జనసేన ఇన్చార్జ్ పోతుల సాయినాథ్ జనసేన పార్టీ పతాకావిష్కరణ చేసి అనంతరం భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సాయినాథ్ ను మండల జనసేన, కూటమి నాయకులు పూల మాలలు, దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ వర్ధిల్లాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, పోతుల సాయినాథ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలకు హోరెత్తించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజ లు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ఐకమత్యంతో వైకాపా ను చిత్తుగా ఓడించాలన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎద్దుల నరసింహులు, నరేందర్ రెడ్డి, సురేష్, మండల అధ్యక్షుడు కరుణాకర్, మురళి, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, నరసింహులు, వీరాంజనేయులు,రామచంద్ర, మ్యూజికల్ శివ, మణి, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :