నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ - ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News