Monday, 14 September 2026 05:26:12 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం

రైతులకు 1B, పత్రాల పంపిణీ - కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 March 2026 09:02 PM Views : 309

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : రెవెన్యూ వెబ్ల్యాండ్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిరంతరం చర్యలు చేపడుతోందని,, ఇందులో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రెవెన్యూ వెబ్లాండ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ.. మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్లో 10 వెబ్ ల్యాండ్ 1బి అడంగల్ పత్రాలకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, మదనపల్లి సబ్ డివిజన్ల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా సర్వే నంబర్ సవరణలు, సర్వే నంబర్ అడిషన్స్, అడంగల్ వివరాల సరిదిద్దడంపై పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చూపిన ప్రత్యేక చొరవతో ఏళ్ల తరబడి పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్, రాయచోటి ఆర్.డి.ఓ ఆమోదించిన 10 వెబ్ ల్యాండ్ 1B పత్రాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని కోర్ట్ హాల్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది రైతులకు వెబ్ ల్యాండ్ సమస్యలు పరిష్కరించి సంబంధిత 1B పత్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. మిగిలిన దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కారం కల్పిస్తామని పేర్కొన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ రామసముద్రం,నిమ్మనపల్లె, గుర్రంకొండ, రాయచోటి సబ్ డివిజన్ క్రింద సంబేపల్లి తదితర గ్రామాలకు చెందిన పలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి 1బి పత్రాలను నేడు జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. అదే విధంగా 22ఏ భూమి సమస్యలకు సంబంధించి ఈ నెల మొదట వారం లో డెబ్బై రెండు, ఈ వారం లో డెబ్బై 22ఏ భూమి సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో వెబ్ ల్యాండ్‌కు సంబంధించి వచ్చిన 10 దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ రికార్డులు, పాత దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా గత తొమ్మిది నుంచి పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత ముఖ్యమని, భూమి లావాదేవీలు, పంట రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్ ల్యాండ్ రికార్డులు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :