నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 23 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో వద్ద డి.యం.హెచ్.ఓ. ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మీ నరసయ్య గారి ఆధ్వర్యంలో కార్యాలయంలోని అన్ని విభాగాల ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్బంగా డి.యం.హెచ్.ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, స్వేచ్ఛాయుతంగా మరియు భయరహితంగా ఓటు హక్కును వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన ప్రోగ్రాం అధికారులు , అన్నీ విభాగల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News