నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 ః బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించడం పై తంబళ్లపల్లె మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మండల బిజెపి అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్ డి ఏ కూటమికి దేశంలో రాష్ట్రంలో తిరుగు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, డీలర్ సుబ్బయ్య, మగ్గాలు లక్ష్మయ్య, చక్రపాణి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, కూటమి నాయకుడు రామాంజులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News