నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 13 : ఈశా ఫౌండేషన్ వాలంటీర్లు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ మరియు వినోద్ జె. అన్నమయ్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ధీరజ్ కనుబులి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, జూలై 18, 19 తేదీలలో సీటీఎం (CTM)లోని ప్రకృతి వనంలో నిర్వహించనున్న 18వ గ్రామోత్సవంకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం యొక్క విశిష్టత, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం పోషిస్తున్న పాత్ర, గ్రామీణ యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా గ్రామోత్సవం ఎలా నిలుస్తుందో బ్రోచర్ల ద్వారా వివరించారు. శ్రీ ధీరజ్ కనుబులి, ఐపీఎస్ గారు ఈశా ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, గ్రామోత్సవంలో పాల్గొనే వాలీబాల్ మరియు త్రోబాల్ క్రీడాకారులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ, యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానం, ఐకమత్య భావన, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందించే ఈ 18వ గ్రామోత్సవం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు
Reporter
Namitha News