నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు రహదారి ముండ్ల చెట్లతో కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిలో కోర్టుతో పాటు బీసీ బాలుర గురుకులం,సచివాలయం, జగనన్న కాలనీ, సాయిబాబా గుడి, ఇట్నేని వారి పల్లి, అక్కమ్మ చెరువుకు ఇదే రహదారి కావడంతో నిత్యం వందలాదిమంది రాకపోకలు సాగిస్తారు. రహదారి కంపచెట్లతోఇరుకుగా ఉండడంతో పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చెట్ల తొలగింపు చేపట్టాల్సి ఉంది.
Reporter
Namitha News