Saturday, 12 September 2026 12:57:13 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

బధ్లావ్ జరూరీ హై-మార్పు అవసరం

చలో ఢిల్లీ" కార్యక్రమాన్ని జయప్రదం చేయండి:సిపిఐ

Date : 23 August 2026 07:20 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు, సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ నగరంలోని రామ్ లీలా మైదానంలో జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం 11 గంటలకు పేటీఎం రోడ్డు నందు చల్లో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ;దేశ ప్రజల భావోద్వేగాలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరపకపోగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని,ఈ నేపథ్యంలో కేంద్రంలో "బద్లావ్ జరూరీ హై" "మార్పు అవసరం" అన్న నినాదంతో,కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు,దేశవ్యాప్తంగా ఈ నెల 6 నుండి 15 వరకు పాదయాత్రలు,17 నుండి 28 వరకు ప్రజాసంఘాల ఆందోళనలు నిర్వహించి,సెప్టెంబర్ ఒకటవ తేదీన "చలో ఢిల్లీ"కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.ధరల పెరుగుదలను తక్షణం అరికట్టాలని,ప్రతి యువకుడికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, సార్వత్రిక విద్య,ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావాలని, మహిళల రక్షణకు బలమైన చర్యలు తీసుకోవాలని, రైతన్నలకు గ్యారెంటీ మద్దతు ధర (MSP) ఇవ్వాలని,కాంట్రాక్టు, హక్కులు ఉన్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని,ఓటర్ల జాబితా శుద్ధి చేసి లోకసభ ఎన్నికలు నిర్వహించాలని, దళితులు,ఆదివాసీలు, అనగారిన మైనార్టీలకు న్యాయం చేయాలని, అత్యాచారాలు,వివక్షను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ మీద ఢిల్లీలో జరిగే ర్యాలీ,బహిరంగ సభలకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం. అష్రఫ్అల్లి,ఎం.గంగులప్ప,దుమ్ము.బాబు,ఎస్. హబీబ్,నర్సింహులు,గంగాద్రి,అంజి,నరేష్,వెంకటప్ప,వెంకటమణ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :