Wednesday, 17 June 2026 03:16:07 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పై ప్రజలకు అవగాహన

Date : 13 June 2026 09:27 PM Views : 75

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వీఆర్వో నాగరాజు ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ ఆమోదయోగ్యమన్నారు. సోమవారం నుండి ఎన్నుమరేషన్ ఫామ్ ఇస్తారని జూన్ 1 నుండి 15 వరకు జరిగే ఈ ప్రక్రియ అనంతరం జూలై 21వ తేదీ తర్వాత కొత్త ఓటరు నమోదు జరుగుతుందని తెలిపారు. జూలై 14వ తేదీ వరకు ఎటువంటి సవరణలు ఉండవని జూలై 15 తర్వాత చిరునామా ఫోటో తదితర అంశాలతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారు ఒకచోట తొలగించుకొని ఒకే చోట ఉంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కేవలం జనాభా లెక్కల్లో మాత్రమే ఉంటారని వారికి ఓటు హక్కు ఉండదని తెలిపారు. సర్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను బిఎల్ఓ లకు అందజేయాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :