నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు,అధికారులు వైభవంగా ప్రారంభించారు. ఉదయం ఆర్టీసీ బస్టాండ్ లో మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ మేనేజర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దివ్యాంగులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ రమణారెడ్డి, ఏవో థామస్ రాజాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వివంగశక్తి ఇంద్రధనస్సు పథకం తో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. నూతనంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన దివ్యాంగులు ఆధార్ కార్డు, పి.హెచ్ సర్టిఫికెట్, రెండు ఫోటోలతో మదనపల్లి డిపోలో సంప్రదించి కార్డు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి, వీఆర్వోలు నాగరాజు,టిడిపి నాయకులు పురుషోత్తం, నరసింహులు, సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, రాజశేఖర్,నరేంద్ర నాయుడు, రామాంజులు, ఐసుల కిట్ట,దళితవాడ రెడ్డప్ప, దివ్యాంగులు పాల్గొన్నారు
Reporter
Namitha News