నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయుల ఆటలు పోటీలకు జట్లను ఎంపిక చేసే కార్యక్రమం ను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుష ఉపాధ్యాయులకు రెండు క్రికెట్ జట్లను ఎంపిక చేసుకోగా మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్ జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఏపీమోడల్ స్కూల్ మైదానంలో మండల స్థాయి ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ఎంపికైన ఉపాధ్యాయులు 15వ తేదీ ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా ఆటల్లో పాల్గొనాలని చెప్పామన్నారు. మండల స్థాయిలో గెలిచిన జట్టును 22 వ తేదీన డివిజన్ స్థాయిలో ఆడాల్సి ఉంటుందని అనంతరం గెలిచినవారు జిల్లా స్థాయిలో పాల్గొనాలని తెలిపారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులను ఈ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి మట్లవారిపల్లి మరియు ఏపీ మోడల్ స్కూల్ పీడీలు పార్థసారథి, ఇందిరా ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రెడ్డి, తిరుమల రెడ్డిపల్లె నరసింహులు, మహమ్మద్ ఖాన్, సుధాకర్, మహీధర్ రెడ్డి ,సీనియర్ ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News