Wednesday, 29 July 2026 04:55:33 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలంటూ సీపీఐ నిరసన

కూలీల కడుపులు కొట్టే విబి జి రామ్ జీ బిల్లును రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యతిరేకించాలి

Date : 22 December 2025 07:46 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 21 : దేశంలోని కోట్లాదిమంది కష్టజీవుల కడుపు కొట్టే విబి జి రామ్ జీ బిల్లును ఏకపక్షంగా తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్ మీద,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా, సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బి.కొత్తకోట మండల సమితుల ఆధ్వర్యంలో, సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల తహసిల్దార్ కార్యాలయం ముందర"ధర్నా"నిర్వహించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి. నారాయణస్వామి లు మాట్లాడుతూ;వామపక్ష పార్టీల ఒత్తిడితో యూపీఏ1 ప్రభుత్వం 2005 సంవత్సరంలో పేదలకు పని హక్కు కల్పించేందుకుగానూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చిందని,గత రెండు దశాబ్దాలుగా కోట్లాదిమంది కూలీలు అందులోనూ ఎక్కువమంది మహిళలు ఇందులో పని చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు.బిజెపి ప్రభుత్వం గద్దె నెక్కినప్పటి నుండీ ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో, ఒక పథకం ప్రకారం కుట్రలు చేసి ఈ చట్టాన్ని సవరించి ఒక పథకంగా మార్పు చేసి,వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జీ) అన్న హిందీ పేరు పెట్టి మత విశ్వాసాలను ప్రేరేపించాలని మోడీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు.అదేవిధంగా ఇందులో ఖర్చులో 60 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే ప్రతిపాదనను చేర్చారని,పనుల ఎంపికకు గ్రామపంచాయతీలకు అధికారం లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వమే ఏ పనులు చేయాలో నిర్ణయించే నిబంధనను తీసుకువచ్చారని ఆవేదన చెందారు.ఈ యొక్క బిల్లును తీసుకురావడానికి కొన్ని రోజుల ముందే దేశవ్యాప్తంగా దాదాపు 16.3 లక్షల మంది ఉపాధి కూలీల పేర్లను కేంద్రం తొలగిస్తే,అందులో 11,07,339 మంది మన రాష్ట్రానికి చెందిన కూలీలే ఉన్నా కూడా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మౌనం వహించడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాయడం మాని ఈ యొక్క దుర్మార్గమైన, కష్టజీవుల కడుపులు కొట్టేటువంటి,గ్రామ పంచాయతీల హక్కులను కాలరాసేటువంటి,రాష్ట్రాలపై భారాలుమోపే బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల తహసిల్దార్ బాబాజాన్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,గంగులప్ప, హబీబ్,జవహర్ బాబు, గంగన్న,శంకర,లక్ష్మన్న,షఫీ,అమీర్,రాజగోపాల్,వెంకటరమణ,గంగాద్రి,అంజి,మస్తాన్,రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :