Sunday, 13 September 2026 07:51:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

డెంగ్యూ వ్యాధి పై అవగాహన కార్యక్రమం

డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు

Date : 01 July 2026 09:04 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 01 : పుంగనూరు సబ్ యూనిట్ పరిధిలోని తూర్పుమొగసాల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, BD కాలనీ-1 సచివాలయం పరిధిలో గల BD కాలనీ నందు UPHC తూర్పుమొగసాల వైద్యాధికారి Dr.జయంత్ సాయి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం మరియు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. . ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మాట్లాడుతూ ఈ జులై నెల ఒకటవ తారీఖు నుండి 31 తారీఖు వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవములు జరుగుచున్నవి. డెంగ్యూ అనేది ' *ఏడిస్* ' (Aedes) దోమలు కుట్టడం వల్ల వచ్చే ప్రమాదకర వైరల్ జ్వరం. దీనివల్ల తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ప్లేట్‌లెట్ల (రక్తకణాలు) సంఖ్య పడిపోవడం జరుగుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని సులభంగా నివారించవచ్చును. డెంగ్యూ జ్వరం గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. *డెంగ్యూ లక్షణాలు* దోమ కుట్టిన 4 నుండి 10 రోజులలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి: ఆకస్మికంగా వచ్చే అధిక జ్వరం (104-105 డిగ్రీల వరకు), తీవ్రమైన తలనొప్పి మరియు కళ్ళ వెనుక నొప్పి, కీళ్ళు మరియు కండరాలలో భరించలేని నొప్పులు, (ఎముకలు విరిగినట్లు అనిపించడం), వాంతులు, వికారం మరియు శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం. *దోమలు ఎక్కడ పెరుగుతాయి?* ఈ దోమలు మురికి నీటిలో కాకుండా, స్వచ్ఛమైన నిల్వ ఉన్న నీటిలో మాత్రమే పెరుగుతాయి. కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, మరియు కుండీలలో నిల్వ ఉండే నీరు వీటి నివాసాలు. * *తీసుకోవాల్సిన - జాగ్రత్తలునీరు** నిల్వ ఉండకుండా చూసుకోవడం: ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండనివ్వకండి. *దోమల నివారణ* : నిద్రపోయేటప్పుడు దోమల తెరలను ఉపయోగించండి. పూర్తి చేతులు, కాళ్ళు కప్పే దుస్తులు ధరించండి. దోమల మందులు: దోమలు కుట్టకుండా ఉండే క్రీములు లేదా లోషన్లు వాడండి. *చికిత్స మరియు ఆహారం* జ్వరం రాగానే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోండి. డెంగ్యూ సమయంలో శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. కాబట్టి, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మరియు మంచినీరు పుష్కలంగా త్రాగాలి. బొప్పాయి ఆకు రసం, కివీ పండు, మరియు దానిమ్మ తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచుకోవచ్చునని తెలిపారు. అలాగే మలేరియా, చికున్ గున్యా, మెదడువాపు వ్యాధి, బోధకాలు వ్యాధి వంటి వ్యాధుల గురించి మరియు నివారణ చర్యలు గురించి ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి Dr. జయంత్ సాయి గారు, పుంగనూరు సబ్ యూనిట్ అధికారి G. గంగయ్య గారు, బహుళార్థ సాధక ఆరోగ్య సహాయకులు P. సోమశేఖరాచారి, ANM లు వెంకటలక్ష్మి, భారతి, ఆశా కార్యకర్త గౌతమి మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :