నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 5 : ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి పంచాయతీ అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని ప్రజలకు స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. గురువారం ఆయన తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో పలు దుకాణాలు, గృహాల వద్దకు వెళ్లి ఇంటి పన్ను వసూళ్లపై ఆరా తీశారు. ఇంటి యజమానులతో తంబళ్లపల్లె అభివృద్ధి చెందడానికి సకాలంలో ఇంటి పన్ను చెల్లించి అభివృద్ధి పనులకు దోహదపడుతుందని సలహా ఇచ్చారు. పలువురు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పడంతో వెంటనే పనులు నిర్వహించడానికి డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News