నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 ః మదనపల్లి డాక్టర్ అగర్వాల్ దృష్టి ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డాక్టర్ నిరంజన్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి 67 మంది కి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 40 మందికి ఆపరేషన్లు చేయడానికి ఎంపిక చేశారు. ఆపరేషన్లు ఎంపికైన వారికి మదనపల్లె అగర్వాల్ కంటి వైద్య ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన వారు ఆధార్ కార్డు, హెల్త్ కార్డు తప్పక తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి,ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,ఏపిఎం గంగాధర్ లకు ఇమ్యానిల్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సిబ్బంది కళ్యాణి, అన్విత సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News