Tuesday, 14 April 2026 05:37:42 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

భగత్ సింగ్ కాలనీ లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ తో అణువణువూ జల్లెడ

Date : 11 April 2026 02:48 PM Views : 74

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 11: శనివారం వేకువజామున సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరు పట్టణం లోని భగత్ సింగ్ కాలనీ లో ఒక్కసారిగా ఖాకీల పహారా లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలికిడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ 'కార్డ ఆన్ సెర్చ్' ఆపరేషన్, అణువణువునూ జల్లెడ పట్టారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి, కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల అనంతరం పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి భద్రతపై భరోసా కల్పిస్తూ మీ భద్రతే మా ప్రాధాన్యత, మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెనుకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు

ఆపరేషన్‌లో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ గారితో పాటు ఎస్సైలు అన్సార్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి కార్డ్ ఆన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :