నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 15 : భారత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో భాగంగా దేశీయ గోమాతల సంరక్షణ లో భాగంగా గోయాత్ర కార్యక్రమం చేపట్టినట్లు తిరుపతి రామకృష్ణ మిషన్ సంయుక్త కార్యదర్శి స్వస్థత ఆనంద స్వామీజీ తెలిపారు.తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ కనికలమ్మ గోశాల నుండి గోపాల్స్ గో సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు రామసుబ్రహ్మణ్యం పిలుపుమేరకు ప్రతినిధి శివకుమార్ ఆధ్వర్యంలో మన పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ దేశీయ గోమాతలకు పూజలు నిర్వహించి, పూర్వపు ఎద్దుల బండ్లు తో గోశాల నిర్వాహకులు మణికంఠన్ సారథ్యంలో గోయాత్ర నిర్వహించారు. ఈగోయాత్ర మర్రిమాకులపల్లి, కన్నెమడుగు పంచాయతీలలోని మారుమూల గ్రామాలలో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గో ప్రేమికులు విశ్వమాత గోమాత, వందే గోమాతరం నినాదాలతో గోయాత్ర కొనసాగించారు. మారుమూల గ్రామాలలో మహిళలు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున గోమాతలకు పూజలు నిర్వహించి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి స్వచ్ఛదానంద స్వామి మాట్లాడుతూ స్వదేశీ గోమాతల ద్వారా గోసంరక్షణ, భూ సంరక్షణ, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో భావితరాలు ఆరోగ్యవంతంగా ఉంటారని హితోపదేశం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన గోమాత సంరక్షణ పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని మన ప్రకృతి గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు బంగారు బాట కాగలదన్నారు. ఈ సందర్భంగా గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం వాటి ఉపయోగాలపై సుదీర్ఘ అవగాహన ప్రసంగం చేశారు. ఈగో యాత్రలో పల్లె ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, గోపాల్స్ గోమాత సంరక్షణ సంస్థ ప్రతినిధులు, గో ప్రేమికులు పాల్గొన్నారు
Reporter
Namitha News