Thursday, 16 April 2026 03:04:22 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గోమాతల సంరక్షణే ధ్యేయంగా గోయాత్ర - స్వస్థతానంద స్వామిజీ

Date : 15 March 2026 08:16 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 15 : భారత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో భాగంగా దేశీయ గోమాతల సంరక్షణ లో భాగంగా గోయాత్ర కార్యక్రమం చేపట్టినట్లు తిరుపతి రామకృష్ణ మిషన్ సంయుక్త కార్యదర్శి స్వస్థత ఆనంద స్వామీజీ తెలిపారు.తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ కనికలమ్మ గోశాల నుండి గోపాల్స్ గో సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు రామసుబ్రహ్మణ్యం పిలుపుమేరకు ప్రతినిధి శివకుమార్ ఆధ్వర్యంలో మన పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ దేశీయ గోమాతలకు పూజలు నిర్వహించి, పూర్వపు ఎద్దుల బండ్లు తో గోశాల నిర్వాహకులు మణికంఠన్ సారథ్యంలో గోయాత్ర నిర్వహించారు. ఈగోయాత్ర మర్రిమాకులపల్లి, కన్నెమడుగు పంచాయతీలలోని మారుమూల గ్రామాలలో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గో ప్రేమికులు విశ్వమాత గోమాత, వందే గోమాతరం నినాదాలతో గోయాత్ర కొనసాగించారు. మారుమూల గ్రామాలలో మహిళలు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున గోమాతలకు పూజలు నిర్వహించి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి స్వచ్ఛదానంద స్వామి మాట్లాడుతూ స్వదేశీ గోమాతల ద్వారా గోసంరక్షణ, భూ సంరక్షణ, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో భావితరాలు ఆరోగ్యవంతంగా ఉంటారని హితోపదేశం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన గోమాత సంరక్షణ పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని మన ప్రకృతి గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు బంగారు బాట కాగలదన్నారు. ఈ సందర్భంగా గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం వాటి ఉపయోగాలపై సుదీర్ఘ అవగాహన ప్రసంగం చేశారు. ఈగో యాత్రలో పల్లె ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, గోపాల్స్ గోమాత సంరక్షణ సంస్థ ప్రతినిధులు, గో ప్రేమికులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :