Friday, 19 June 2026 03:18:50 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

టీనేజీ ఆడపిల్లల నడవడికపై తల్లిదండ్రులూ నిఘా ఉంచండి - యస్.ఐ. అనిల్ కుమార్.

Date : 25 April 2026 09:46 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : టీనేజీ ఆడపిల్లల నడవడికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఐకెపి కార్యాలయంలో గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలు,సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందే లక్ష్యంగా సహకరించాలన్నారు. ఫోక్సో చట్టం పై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు తమ పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శక్తి టీం సభ్యులు బి.ముని కుమార్ నాయక్, శశికళ లు టీనేజీ వయసులో ఆకర్షణలకు నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేసు స్టడీస్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటి పట్ల అప్రమత్తత, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్ప్రభావాలు, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అందుబాటులోకి వచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు వివరించి అత్యవసర సహాయం కోసం 1930,112,1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలన్నారు. మహిళలు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు గురి చేయకుండా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ, ఎస్ఐ నజీర్ భాష, టిడిపి నాయకులు బేరి శ్రీనివాసులు, పురుషోత్తం, కసెట్టి వెంకటరమణ, సీసీలు కత్తి నరసింహులు, రమణ, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, ఐకెపి మహిళలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :