Tuesday, 15 September 2026 06:49:34 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి

Date : 04 April 2026 05:38 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సాటి మనిషికి సహాయ పడటమే మానవత్వం - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ - ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి మదనపల్లె ఏప్రిల్ 4, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం ప్రతినిధి ) : సాటి మనిషికి సహాయ పడటమే మానవత్వమని ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి అన్నారు. శనివారం ఆమె పుట్టినరోజు ను పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ సి డి ఎస్ అధ్యక్షులు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి బంగారు సుగుణ, ముక్తాపురం సుప్రజా రెడ్డి, డిష్ రెడ్డి కుమారి, మేకల సురేంద్ర, వైఎస్ఆర్సిపి కురబల కోట యూత్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, మదనపల్లి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సాంబశివరెడ్డి, మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి, జడ్పిటిసి నల్లపురెడ్డి రమణారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి లు హాజ రయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులలో మరియు ఒపీ వద్ద రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. అనంతరం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ పద్మ ప్రియ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్బంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.​తోటి వారికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదని పేర్కొన్నారు. వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసు కున్నారు.ఆర్ సి డి ఎస్ అధ్యక్షులు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ​​పద్మప్రియ రెడ్డి సామాజిక సేవా రంగంలో చురుగ్గా ఉంటూ, తన పుట్టిన రోజున ఇలాంటి మంచి కార్య క్రమం చేపట్టడాన్ని అభి నందించారు. ​రోగులకు పండ్లు అందజేస్తున్న సమయంలో ఆమె చూపిన ఆప్యాయత మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. అదే విధంగా ఆర్ సి డి ఎస్ తరపున ఆమె కి జన్మదిన శుభా కాంక్షలు తెలియ జేశారు. ఆమె మరెన్నో జన్మదినోత్స వాలను జరుపుకోవడంతో పాటు భగవంతుడు ఆయురారో గ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :