నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 21 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు గ్రామం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఏం.సి.ఏ మొదటి మరియు రెండవ సంవత్సరము చదువుతున్న 7 మంది విద్యార్థులకు హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ పరివర్తన్ యొక్క ECSS ప్రోగ్రామ్ (మెరిట్-కమ్-నీడ్ బేస్డ్) స్కాలర్షిప్ లు అందజేసినట్లు వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్ డి ఎఫ్ సి వారు విద్యార్థుల మెరిట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్కాలర్షిప్ లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్ లు పొందిన విద్యార్థులకు ఒక్కక్కరికి 75000 చెప్పున మొత్తం 5,25,000 /- అక్షరాలా ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ , ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు
Reporter
Namitha News