Thursday, 30 July 2026 02:57:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో విద్యాలక్ష్మి రుణాల పై అవగాహన - యస్.బి.ఐ. రుస్తుమ్ ఖాన్

Date : 02 December 2025 07:11 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 02 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కాలర్ షిప్స్ విభాగం వారు యూనివర్సిటీ విద్యార్థులకు విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా లభించే విద్యా రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎస్.బీ.ఐ బ్యాంకు మేనేజర్ రుస్తుమ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వం అందిస్తున్న విద్యా రుణాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా రుణ దరఖాస్తు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండటంతో పాటు విద్యను నిరవధికంగా కొనసాగించేందుకు ఇది ఎంతగానో సాయపడుతుందని తెలిపారు. విద్య లక్ష్మి పోర్టల్ ద్వారా ఒక్కో విద్యార్థికి ₹7.5 లక్షల వరకు ఎలాంటి గిరవు లేకుండానే ఆధార్, పాన్ మరియు మంచి సిబిల్ స్కోర్ ఆధారంగా విద్యా రుణాలు పొందవచ్చని వివరించారు.విద్యార్థులకు ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు యూనివర్సిటీ యాజమాన్యం బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగాధిపతి డాక్టర్ ఆతహర్ సమీనా ఖాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :