నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జూన్ 18 : ములకలచెరువు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జయకుమారి గుండెపోటుతో మృతి చెందడం పట్ల నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకుమారి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యారంగానికి జయకుమారి అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. ఈ సందర్భంగా జయకుమారి కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపిన మంత్రి నారా లోకేష్
Reporter
Namitha News