నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 ః ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించడమే పరమావధిగా భావించాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. గురువారం ఆయన మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలోని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించి మారుమూల గ్రామాలలోని ప్రజల మన్ననలు పొందాలన్నారు. అధికారులు తమ విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహించరాదని సమస్యలపై ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అధికారులు తెచ్చుకోరాదని సూచించారు. వేసవి దృశ్య గ్రామాలలో తాగునీటి సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా కార్యదర్శులకు సూచనలు ఇవ్వాలని ఏవో థామస్ రాజాకు సూచనలు ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. ఆయనతో ఏవో థామస్ రాజా, టిడిపి నాయకుడు కాలా నారాయణ, జనసేన నరసింహులు, మాజీ సర్పంచ్ సుధాకర్, సలాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News