నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం... మదనపల్లె నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని ని పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సంస్థ సిబ్బందితో కలసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.పోర్డ్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.పోర్డ్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డిఎస్పికి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘనచరిత్ర కలిగిన మదనపల్లె డివిజన్ కు మహిళా పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్డ్ సంస్థ బాలకార్మికులు,బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యాహక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు.
Reporter
Namitha News