నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 17 : తంబళ్లపల్లి మండలం ఎద్దుల వారి పల్లి, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలో సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి ఆధ్వర్యంలో మూడు పంచాయతీలలో గ్రామాలతో పాటు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల తో పాటు కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కరిముల్లా, సర్పంచ్ రెడ్డి నారాయణ, వీరభద్ర, రవికుమార్, శివకుమార్, జిల్లా బిసి కార్యవర్గ సభ్యుడు రామ్మూర్తి, చలపతి నాయుడు, ఎల్ఐసి వెంకటరమణారెడ్డి, తాళ్ల చంద్రశేఖర్, నరసింహారెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామలింగారెడ్డి, రంగారెడ్డి, సత్తార్ సాబ్, కుక్క రాజు పల్లి బాబ్జాన్, సిద్దయ్య, అన్వర్ బాషా కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News