నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 05 : మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ 119వ జయంతి సందర్బంగా అంబేద్కర్ సర్కిల్ లో ఘనంగా నివాళులు అర్పించిన చిత్తూరు మాజీ ఎంపీ యన్. రెడ్డెప్ప . ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ ప్రముఖంగా 'బాబూజీ' అని పిలవబడే దళిత నాయకుడు, 5 ఏప్రిల్ 1908 న బీహార్లో జన్మించారు. బీహార్లోని అర్రా టౌన్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో చదివాడు, అక్కడ మదన్ మోహన్ మాల్వియాతో సంభాషించే అవకాశాన్ని పొందారూ. బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత నాయకుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు. 40 ఏళ్లకు పైగా పార్లమెంటేరియన్ గా అనతి కాలం కేంద్రమంత్రి గా వివిధ శాఖలలో రాణించారు , ఉప ప్రధానిగా పనిచేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమం లో స్థానిక దళిత సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News