నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యన్.సి.సి. 11ఏ ఎయిర్ వింగ్ కేడెట్ల కోసం రెండు రోజుల పాటు ఎయిరోమోడలింగ్ డిజైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎయిరోమోడలింగ్ మరియు అడ్వెంచర్ శిక్షణలో నిపుణుడైన అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్, ఫ్లయింగ్ ఆఫీసర్ ఎం. రఘువీర కుమార్, బద్వేల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా కేడెట్లను జాతీయ స్థాయి వాయు సైనిక్ క్యాంపు (VSC) పోటీలకు సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. విమానాల ప్రాథమిక సూత్రాలు, గాలి ఒత్తిడి, సమతుల్యత వంటి అంశాలపై అవగాహన పొందడం ద్వారా విమానయాన రంగంపై స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విమాన నమూనాల తయారీ మరియు ఫ్లయింగ్ నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఇటువంటి శిక్షణల ద్వారా కేడెట్లలో సాంకేతిక జ్ఞానం, క్రమశిక్షణ, టీమ్వర్క్ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ శిక్షణ భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్, విమానయాన ఇంజినీరింగ్ మరియు రక్షణ రంగాల్లో కెరీర్ అవకాశాలకు బలమైన పునాది అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, యెన్.సి.సి 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు యెన్.సి.సి ఎయిర్ వింగ్ క్యాడెట్ విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News