నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 ః మద్యం సేవించి డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం క్రాస్ రోడ్ లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, అతివేగంతో ప్రజలను ఇబ్బంది పెట్టడం,మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వడం లాంటి చర్యలు చేయరాదన్నారు. ద్విచక్ర వాహనాలు సైతం రోడ్డుకు అడ్డంగా దుకాణాలకు ముందు ఉంచి రాకపోకలకు,పాదచారులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వాహన చోదకులు రికార్డులు దగ్గర ఉంచుకొని రోడ్డు భద్రత సూచనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది రాఘవ, జమీల్, ప్రజలు ఉన్నారు.
Reporter
Namitha News