నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 ః తంబళ్లపల్లె మండలం లో శుక్రవారం క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తంబళ్లపల్లె సి ఎస్ ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ పాల్ రాజ్ ఆధ్వర్యంలో మదనపల్లి జెసీఎం చర్చి నుండి ఎల్ పి ఎఫ్ ఫెలో షిప్ సభ్యులు శ్రీమతి మేరీ మార్గరెట్, శోభమ్మ, రత్నవేణి, గీతమ్మ లు ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఈ6 దినం శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మాను పై పలికిన పవిత్రమైన ఏడు మాటలను రాణించడం జరిగింది. ఏసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, దేవుని నిరూపమాన ప్రేమను స్మరించుకొనే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని బోధించారు. మానవాళి పాప పరిహారం కోసం క్రీస్తు పడిన వేదనను, క్షమా గుణాన్ని ధ్యానిస్తూ ప్రేమ మరియు శాంతి మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదకరమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్డు నరసింహులు, ఎల్ఐ భాస్కర్, కరెంట్ యోహాను, చంద్రమ్మ, సుజాత, దేవ శిఖామణి, చిట్టిబాబు, విమలమ్మ, వసంతమ్మ, శ్యామలమ్మ, సంఘస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
Reporter
Namitha News