నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - మార్చి 09 : పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివారిపల్లి సమీపంలోని బావి లో మృతదేహం ను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలం కు చేరుకొన్న పోలీసులు గ్రామస్థుల సహకారం తో మృతదేహం ను వెలికితీయగా మృతుడు అదే గ్రామానికి చెందిన సురేష్ గా ఇతను వైజాగ్ లో సి.ఆర్.పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం శెలవు పై గ్రామానికి వచ్చినట్లు వెల్లడిస్తున్న గ్రామస్థులు. మృతదేహం తల పై గాయాలు ఉన్నట్లుగా మృతి పై అనుమానం ఉందని వెల్లడిస్తున్న కుటుంబీకులు. అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేస్తూ మృతదేహం ను పోస్టుమోర్టుమ్ నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రి కి తరలించి పోస్టు మోర్టుమ్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తామంటున్న పెద్దతిప్ప సముద్రం పోలీసులు
Admin
Namitha News