నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చ్ 12 ః తంబళ్లపల్లె మండల కేంద్రం వైయస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలు మేరకు మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటిరెడ్డి, యువ నాయకుడు శివారెడ్డి, భాస్కర్ రెడ్డి నరసింహారెడ్డి, సిద్ధారెడ్డి, రెడ్డి మల్ రెడ్డి, కరిముల్లా, మల్లికార్జున, రామ్మూర్తి, జయ నారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News