నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 16 : బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ను మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ సభ్యులు దుశ్యాలువలు, స్వామివారి మెమెంటోతో ఘనంగా సత్కరించారు. సాయి లోకేష్ ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తున్న అన్నదాన కమిటీ సభ్యులను ప్రశంసించారు. కమిటీ సభ్యులు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిన సాయి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు రమణ, మగ్గాల లక్ష్మయ్య, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,యుగంధర్, హరినాథరెడ్డి, అన్నదాన కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News