నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఏప్రిల్ 12 : చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద వెలసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కు గత ఏడాది కంటే అధికంగా పెరిగిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థాన ఆదాయం ఆలయ ఉప కమిషనర్ & ఆలయ ఇవో ఏకంబరం వెల్లడించారు గత ఏడాది సుమారు 12కోట్ల పంతొమ్మిది లక్షల ఎనబై రెండు వేలు కాగా ఈ ఏడాది సుమారు 16కోట్ల ముప్పై లక్షల తొంబై వేల రూపాయలు అమ్మవారి ఆలయ ఆదాయం.. గత సంవత్సరం కంటే ఈ యేడు శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెరిగింది. ఆలయం లో లక్ష కుంకుమర్చాన, సేవకార్యక్రమాలు,వేద ఆశీర్వాదం, లఘు దర్శనం,పెద్ద భోగం,హుండీ ఆదాయం,ఆన్ లైన్ టికెట్టు బుకింగ్ ల ద్వారా పెరిగిన ఆలయ ఆదాయం.. ఆలయ అభివృద్ధి కి సహకారం అందించిన భక్తులకు,దాతలకు,అధికార పార్టీ నాయకులకు,ఆలయ సిబ్బంది,ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఇవో ఏకంబరం
Reporter
Namitha News