Thursday, 16 April 2026 06:47:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఎస్పీ గారి ప్రత్యేక చొరవతో కువైట్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన కంపా వీరాంజనేయులు మృతదేహాన్ని ఇండియాకు తరలింపు.

ఎస్పీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్న మృతుని కుటుంబ సభ్యులు.

Date : 15 October 2024 10:36 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి, అక్టోబర్ 15: జీవనోపాధి నిమిత్తం సుండుపల్లె మండలం గడ్డమీదపల్లె గ్రామ నివాసి కంపా వీరాంజనేయులు కువైట్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి మరదలు కంపా లలిత, మృతుడి పిల్లలు విష్ణువర్ధన్-గోవర్ధన్ లు , *జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారిని కలిసి* మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని విన్నవించుకున్నారు, తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి పేపర్ పనులను పూర్తి చేపించి, మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు చివరి చూపు చూసేందుకు స్వగ్రామానికి రప్పించారు. మృతదేహం వెంట కువైట్ లో ఉన్న మృతుని భార్య చెన్నకేశవులమ్మ, మృతుని తమ్ముడు కంపా రమణలు స్వగ్రామం చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశారు. *వివరాల్లోకి వెళితే....* ????సుండుపల్లి మండలం గడ్డమీదపల్లి ఎరుకల కాలనీకి చెందిన కంపా వీరాంజనేయులు కొన్ని సంవత్సరాల కిందట తన భార్య చెన్నకేశవులమ్మను తీసుకొని జీవనోపాధి నిమిత్తము కువైట్ కు వెళ్లారు, అక్కడే ఓ ఇంట్లో పని చేస్తూ ఉండేవారు, కంపా వీరాంజనేయులు డ్రైవర్ గా, వారి భార్య కువైట్ సేట్ ఇంట్లో పనిమనిషిగా ఒకే ఇంట్లో పని చేస్తూ.. రెండు సంవత్సరాలకు ఒకసారి స్వగ్రామానికి వస్తూ పోతూ ఉండేవారు, ఈ క్రమంలో కువైట్ సేటు పెద్ద కుమారుడుతో తన భర్త వీరాంజనేయులు బయటకు వెళ్లాడని ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని, కువైట్ దేశంలో ఇండియా ఎంబసీలో వాలంటరీగా పనిచేస్తున్న పెనగలూరు మండలం కు చెందిన జిలకర మురళి గారితో కంపా చెన్నకేశవులమ్మ మాట్లాడగా.. ఆయన చుట్టుపక్కల వారిని విచారించి మీ భర్త చనిపోయాడని ఫార్మహి హాస్పిటల్ లో మృతదేహం ఉందని చెప్పాడని ఆవేదన చెందారు, ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు కంపా వీరాంజనేయులు మరణవార్త తెలియడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారిని కలిసి విన్నవించుకున్నారు, ఎస్పీ గారు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు. ఎస్పీ గారు వెంటనే చొరవ తీసుకుని కంపా వీరాంజనేయులు మృతదేహాన్ని ఇండియాకు రప్పించినందుకు జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పోలీసు శాఖకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కంపా వీరాంజనేయులు కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :