నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 16 : తంబళ్లపల్లె మండలం లో మంగళవారం నుండి అక్టోబర్1వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 17న గ్రామపంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా, ఉపాధి సిబ్బంది విద్యార్థులతో కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు, స్వచ్ఛత, పరిసరాల శుభ్రత పై ర్యాలీ చేయాలన్నారు. 18న గ్రామస్థాయిలో స్వచ్ఛత రన్, 19న అన్ని పంచాయతీ కార్యాలయాల్లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ, 20న పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలలో తల్లి పేరుతో మొక్కలు నాటి సంరక్షించాలి. 21న మహిళా సంఘాలు, యువజన సంఘాలు క్యాంపెయిన్ ర్యాలీ తోపాటు శ్రమదానం చేయాలి. 22న విద్యుత్, తాగునీరు ఆదా, ప్లాస్టిక్ నిర్మూలన ఇతర పర్యావరణ అంశాలపై క్యాంపెయిన్ చేయాలి. 23న భూగర్భ జలాల అభివృద్ధికి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు తనిఖీ పనిచేసేలా చూడాలి. 24న తాగునీటి వనరుల వద్ద శుభ్రం చేసి శ్రమదానం చేపట్టాలి. 25న స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన మహిళా సంఘాలకు ఉపాధి హామీ మేట్లతో చిన్న చిన్న ప్లే చేయించాలి. 26న పెరిగే టెక్నాలజీ, యాప్స్, లింక్స్ గాడ్జెట్స్ వాడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి. 27న స్వచ్ఛతాహి భాగీరది పై గ్రామసభ. 28న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తో పాటు స్వచ్ఛ అసెట్స్ పై ప్రజలకు అవగాహన బ్యూటిఫికేషన్, వాల్ పెయింట్ తో పరిశుభ్రత నినాదాలు రాయించాలి. 30న జీవితంలో వాడిన ప్లాస్టిక్ ఇతర యూస్ అండ్ త్రో వస్తువులు తిరిగి ఉపయోగపడేలా ప్రజలకు ఉదాహరణంగా టెక్నిక్లు తెలియజేయుట. అక్టోబర్ 1న పంచాయతీ పరిధిలోని స్కూళ్లలో స్వచ్ఛతపై పిల్లల మనోభావాలు, ప్రదర్శనలో తెలియజేయుట, వ్యాసరచన నిర్వహణ, విద్యార్థులు ఇండ్లలో స్వచ్ఛతపై పెద్దలకు తెలిపే విధంగా తర్ఫీదు, పై కార్యక్రమాలన్నీ అధికారి యంత్రాంగం నిర్వహణకు అందరి సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమం నిర్వహణపై ప్రతిరోజు ఫోటోలు, వీడియో వాటిని తిరిగి యాప్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఎంపీడీవో తెలిపారు.
Admin
Namitha News