నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : మదనపల్లె నుండీ బెంగళూరు కు ఇస్టా రాజ్యాంగా వెళుతున్న ప్రయివేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. శనివారం ఉదయం స్థానిక బెంగుళూరు రోడ్డు లో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన ముగ్గురు ఎం.వి.ఐ. లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మధుసూదన్, ఎస్.ఎల్.టి. బస్ లకు ఒక్కొక్క బస్సు కు 20వేలు ఫైన్ రాశారు. అలాగే ఇతర వాహనాలకు లక్ష రూపాయలకు పైగా అపరాధాలు విధించారు. అధికారులు ఒత్తిడిని అధిగమించి ఓ ప్రజా ప్రతినిధి వాహనాలకు కూడా ఫైన్ వేసిన అధికారులు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావ్, ఎంవిఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News