నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : 2027 జనగణన స్వీయ నమోదు కార్యక్రమం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. మంగళవారం కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తంబళ్లపల్లె స్వర్ణ గ్రామం జనగణన స్వీయ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ జనగణన స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన సమాచారం, గోప్యత, సమయం ఆదా, పూర్తి నియంత్రణ, సులభతరం అవుతుందని తెలిపారు. మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జనగణన సమాచారాన్ని అందించి రిఫరెన్స్ నెంబర్ పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 20 27 జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, వీఆర్వో వెంకటరమణ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి ఐకెపి అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, వివో సభ్యులు, మహిళా సంఘాలు, సంఘమిత్రలు పాల్గొన్నారు
Reporter
Namitha News