Sunday, 13 September 2026 11:04:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వెలుగు పాఠశాలలో భారీ ఉచిత వైద్య శిబిరం

వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలకు విశేష స్పందన

Date : 09 May 2026 08:00 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు పాఠశాలలో భారీ ఉచిత వైద్య శిబిరం వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలకు విశేష స్పందన స్థానిక వెలుగు పాఠశాల ప్రాంగణంలో యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డిశేఖర్, గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అధ్యక్షుడు కోన భాస్కర్, యంగ్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు లక్ష్మి, రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో బెంగళూరులోని వైదేహి హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ రిత్విక్ సర్జన్, డాక్టర్ సాయినాథ్ జనరల్ మెడిసిన్, డాక్టర్ టిన్ను ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్ గగన్ ఆర్థోపెడిక్ నిపుణులు పాల్గొని గుండె, క్యాన్సర్, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, కిడ్నీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈఎన్టీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న దివ్యాంగులు, వృద్ధులు, అమ్మచెరువు మిట్ట ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ల్యాబ్ టెక్నీషియన్ సబిన్ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద అర్హులైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సేవా కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. తరువాత విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిత్విక్, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ టిన్ను, డాక్టర్ గగన్, యంగ్ ఇండియా సభ్యులు రాజశేఖర్, లక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డిశేఖర్, కోన భాస్కర్, వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎం. ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపాల్ లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, సోషల్ వర్కర్ గీత, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: