Wednesday, 17 June 2026 02:02:10 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ

మహిళలకు చీరలు పంపిణీ చేసిన పురుం సహదేవ

Date : 08 June 2026 07:34 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ - మహిళలకు చీరలు పంపిణీ చేసిన పురుం సహదేవ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,కదిరి రోడ్డులోని భారతం మైదానం నందు జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం రాత్రి ప్రదర్శించిన సాసవల చిన్నమ్మ కథ ప్రజలను రంజింపజేసింది.ఈ నాటకానికి రామారావు కాలనీ (3వార్డు)కు చెందిన చేనేత విభాగం నాయకులు పురుం సహదేవ ఆర్థిక సహకారం అందజేయడమే కాకుండా నాటకాన్ని తిలకించడానికి విచ్చేసిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సహదేవ మాట్లాడుతూ రోజురోజుకి కళలు అంతరించిపోతున్నాయని కావున అందరూ కళలను ప్రోత్సహించి కళాకారులను ఆదరించాలన్నారు.సాసవల చిన్నమ్మ కథలో అన్ని పాత్రలను చక్కగా ప్రదర్శించారన్నారు.సాసవల చిన్నమ్మ కథ వింటే ఎంతో పుణ్యం లభిస్తుందని,ఈ నాటక ప్రదర్శనకు తనవంతు సహకారం అందించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు.అనంతరం మహాభారతం నిర్వహకులు కొరముట్ల వెంకటేష్ (బీజేపి) మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే మహాభారత యజ్ఞానికి పురం సహదేవ తనవంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.అదేవిధంగా ధర్మరాజు పాత్ర ధరించి రక్తికట్టించారని కొనియాడారు.ఈ ఏడాది మహాభారత యజ్ఞం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని,ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం పురుం సహదేవను పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సుజాతమ్మ,గోపమ్మ,కొప్పల హరినాథ్,శంకర్ రెడ్డి,వెంకట నాగులు,యశోదమ్మ,మనోహర్,గురు ప్రసాద్,ఆదిమూర్తి,మునెప్ప కాలనీ విశ్వనాథ్,శీనా తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :