Thursday, 30 July 2026 03:47:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జలధార-జలహారతికి సహకరించే దాతలను అన్వేషించండి - తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి

Date : 23 May 2026 10:17 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : తంబళ్లపల్లె మండలంలో నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జల హారతి కార్యక్రమానికి సహకరించే దాతలను అన్వేషించాలని అధికారులను తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మరియు డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల గైర్హాజర్ తోబాటు వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయం, హార్టికల్చర్, సిరికల్చర్, మైనర్ ఇరిగేషన్, ఫారెస్ట్, ఉపాధి హామీ శాఖల పనితీరుపై ఆరా తీశారు. ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి నీటి బొట్టును ఎక్కడికక్కడ నిలువరించి తద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి తోబాటు పర్యావరణం పరిరక్షణ జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలు,కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేయడానికి సహకరించాలన్నారు. జలధార-జలహారతి పనులు వేగవంతం చేసి చెరువులు, కుంటలు నీటి వనరులు సంరక్షించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ సమీక్ష లో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, 2047 విజన్ సూపర్వైజర్ రెడ్డప్పలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :