Thursday, 30 July 2026 09:01:02 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 30 July 2026 07:49 PM Views : 16

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 29 : ఎలీనా ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని నీటి సంరక్షణ పనులతో భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించాలని జిల్లా డ్వామా పీడి వెంకటరత్నం సూచించారు. గురువారం ఆయన మండలంలోని ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలో విబిజీ రాంజీ ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు చేపట్టిన ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్ లను తనిఖీ చేశారు. అదేవిధంగా పంచాలమర్రిలో రైతు శేఖర్ పొలంలో ఏర్పాటుచేసిన హార్టికల్చర్ మామిడి, పండ్ల తోటల పెంపకం హర్షినీయమన్నారు. రైతులు స్ఫూర్తి పొంది ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మండలంలో చేపట్టిన ఉద్యానవన పంటల సాగుపై ఉపాధి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సంరక్షణ పనుల వేగవంతంతోపాటు నీటి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలో జరుగుతున్న వీబిజి రాంజీ ఉపాధి పనులలో భాగంగా జరిగిన జలధార-జల హారతి పనులపై పంచాయతీల వారీగా అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తూ పనులు వేగవంతం తో పాటు ప్రతికూలికి పనులు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించరాదని క్షేత్ర సహాయకుల నుండి ప్రతి అధికారి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నిర్వహణపై కూలీలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా మొక్కలు పెంపకం తో పాటు ఫారం పాండ్స్, సాగునీటి వనరుల ఫీడర్ చానల్స్ పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఉషారాణి, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్,టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, క్షేత్ర సహాయకులు కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :