నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 29 : ఎలీనా ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని నీటి సంరక్షణ పనులతో భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించాలని జిల్లా డ్వామా పీడి వెంకటరత్నం సూచించారు. గురువారం ఆయన మండలంలోని ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలో విబిజీ రాంజీ ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు చేపట్టిన ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్ లను తనిఖీ చేశారు. అదేవిధంగా పంచాలమర్రిలో రైతు శేఖర్ పొలంలో ఏర్పాటుచేసిన హార్టికల్చర్ మామిడి, పండ్ల తోటల పెంపకం హర్షినీయమన్నారు. రైతులు స్ఫూర్తి పొంది ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మండలంలో చేపట్టిన ఉద్యానవన పంటల సాగుపై ఉపాధి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సంరక్షణ పనుల వేగవంతంతోపాటు నీటి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలో జరుగుతున్న వీబిజి రాంజీ ఉపాధి పనులలో భాగంగా జరిగిన జలధార-జల హారతి పనులపై పంచాయతీల వారీగా అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తూ పనులు వేగవంతం తో పాటు ప్రతికూలికి పనులు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించరాదని క్షేత్ర సహాయకుల నుండి ప్రతి అధికారి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నిర్వహణపై కూలీలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా మొక్కలు పెంపకం తో పాటు ఫారం పాండ్స్, సాగునీటి వనరుల ఫీడర్ చానల్స్ పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఉషారాణి, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్,టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, క్షేత్ర సహాయకులు కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News