నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 18 : తంబళ్లపల్లి నియోజవర్గం కేంద్రం లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జగనన్న 2.0 యాప్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఫోన్ల లలో యాప్ ను ఇన్స్టాల్ చేయించి ఏ విధంగా ఉపయోగించాలో వారికి తెలియజేసి అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియానే టార్గెట్గా పెట్టుకుని వైఎస్ఆర్సిపి అధికారిక ఖాతాలను తొలగించడం వైఎస్ఆర్సిపి కార్యకర్తల పై అక్రమ కేసులు బానాయించడం జరుగుతుందని దానికి భిన్నంగా "జగనన్న 2.0" యాప్ ను రూపొందించి ప్రతి కార్యకర్త తమ తమ అభ్యంతరాలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఏమైనా సమస్యలు జరుగితే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు బానాయిస్తే, ఆ వివరాలను యాప్ లో ఎక్కించడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాప్ లో లైవ్ ద్వారా చూడడం, వంటి, మరెన్నో కార్యక్రమాలు ఈ యాప్ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయం లో వీక్షించవచ్చని తెలిపిన వైఎస్ఆర్సిపి తంబళ్లపల్లి మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా బిసి ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి వైస్ ఎంపీపీ కరీం, సర్పంచ్ భద్ర మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్ రెడ్డి మరియు నరసింహారెడ్డి ,భాస్కర్ రెడ్డి, సాదిక్, రవీంద్ర, మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి,, మాధవరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎక్స్ ఆర్ బి కే చైర్మన్ రెడ్డి మల్ రెడ్డి మరియు శంకర్ నాయక్ మరియు రాజారెడ్డి శ్రీనివాసులు రెడ్డి భాషా వెంకటరమణ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News