నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలాజీ నగర్ లో శుక్రవారం ఉదయం మానవీయ అమానుష ఘటన ఉదయం వెలుగు చూసింది. కలకలం రేపుతున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను ఓ కసాయి తల్లి పారేసి పేగు బంధాన్ని తెంచుకుని వెళ్లింది. బాహ్య ప్రపంచంలోకి వచ్చి రాకనే ఆ బిడ్డ తనకేంటి ఇంత ఖర్మ వచ్చిందని గుక్క పెట్టి ఆపకుండా ఏడుస్తున్న బిడ్డను స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మధుకర్ ఘటనా స్థలానికి చేరుకొని పేగు కూడా ఊడని ఆ పసి కందును ఎత్తుకుని చుట్టు పక్కల విచారించినా ఆ కసాయి తల్లి ఎవరన్నది తెలియ రాక, స్థానిక మహిళ కు ఇచ్చి ICDS సిబ్బంది కి సమాచారం ఇవ్వగా హుటాహుటిన వచ్చిన ఆయా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, ఉన్నత అధికారులకు సమాచారం, పురిటి బిడ్డ ఆడ బిడ్డ ప్రొసీజర్ ప్రకారం చైల్డ్ కేర్ కు తరలిస్తామంటున్నా పి.డి నాగవేణి
Admin
Namitha News