నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మదనపల్లి లో నేడు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమం ఐన 2 ఏండ్ల నమ్మకం - సూపరిపాలన అధికారిక కార్యక్రమం లో పాల్గొన్న తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి. శంకర్. సాధారణ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించకపోయిన సమయం నుండీ ఏ అధికారిక కార్యక్రమం కానీ, టిడిపి కార్యక్రమాలలో పాల్గొనని జి. శంకర్. రెండు రోజుల క్రితం తంబళ్లపల్లి లో జరిగిన టిడిపి కార్యక్రమం లో పాల్గొన్న జి. శంకర్. నేడు జరుగుతున్న విజయోత్సవ సభ లో ఇద్దరు మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమం లో జి. శంకర్ పాల్గొనడం తో జి. శంకర్ కు తంబళ్లపల్లి ఇంచార్జ్ గా లైన్ క్లియర్ అయినట్టు సూచనలు, తంబళ్లపల్లి టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని టిడిపి శ్రేణులలో చర్చలు మొదలయ్యాయి. గత రెండు సంవత్సరాలు గా మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లి టిడిపి కార్యకర్తల లో తమ నాయకుని కి పీఠం దక్కుతుందన్న ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
Reporter
Namitha News